News June 26, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం: తమ్మినేని

image

కేంద్రం బొగ్గు గనుల వేలం ద్వారా
ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ఇండియా కూటమి ఆధ్వర్వంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలన్నారు.

Similar News

News September 29, 2024

మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు: కలెక్టర్

image

యువత ప్రయాణంలో నేటి మెగా జాబ్ మేళా తొలి అడుగు మాత్రమేనని, ఈ రోజు వచ్చే ఉద్యోగం చేస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం SR&BGNR డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దని కలెక్టర్ సూచించారు.

News September 28, 2024

కొత్తగూడెం: ఆస్తమాతో ఇద్దరు చిన్నారుల మృతి

image

పినపాక మండలం మద్దులగూడెంలో శనివారం సాయంత్రం ఇద్దరు పసి పాపలు ఆస్తమాతో మృతి చెందారు. చిన్నారుల తల్లిదండ్రుల వివరాలిలా.. మద్దులగూడెం ఎస్టీ కాలనికి చెందిన ఇరుప మహేష్, మంజులకు రెండు నెలల బాబు.. పండా ప్రసాద్, మరియమ్మల రెండు నెలల పాప ఆస్తమాతో మృతి చెందారు. భద్రాచలం ఆసుపత్రిలో చూపించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 28, 2024

ఖమ్మం ఖిల్లాకు కలెక్టర్.. రోప్ వే స్థల పరీశీలన

image

ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్‌వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.