News January 9, 2026
బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి: మమత

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.
Similar News
News February 21, 2026
గాలి ఉండగానే తూర్పారబోయాలి

ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి రైతులు గాలి వచ్చే దిశలో ధాన్యాన్ని పై నుంచి కిందకు పోస్తారు. దీనినే తూర్పారబట్టడం అంటారు. గాలి బలంగా ఉన్నప్పుడు ఇది చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుంది. గాలి లేనప్పుడు ప్రయత్నిస్తే పొట్టు సరిగా విడిపోదు, కష్టం వృథా అవుతుంది. జీవితంలో కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు లేదా గొప్ప అవకాశాలు ఎల్లప్పుడూ ఉండవు. అవి లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ఈ సామెత చెబుతుంది.
News February 21, 2026
స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్!

TG: రాష్ట్రంలోని స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. స్టీమ్ రైస్తో విద్యార్థులకు అందించే ఫుడ్ నాణ్యత పెరుగుతుందని ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. దీనితో రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. మిల్లులో ఆడించకముందే ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల స్టీమ్ రైస్ గింజలు విరగవు. అన్నం రుచిగా, పొడిగా ఉంటుంది.
News February 21, 2026
రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

TG: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGసెట్) జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 11AM నుంచి 1PM వరకు ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.


