News January 17, 2026
బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.
Similar News
News February 9, 2026
రావులపాలెం: టీ తాగడానికి వెళ్తే మృత్యువు కబళించింది

రావులపాలెం మండలం ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు వెరయ్య (79) మృతి చెందాడు. టీ తాగడానికి వచ్చిన వృద్ధుడిని రావులపాలెం నుంచి ఆత్రేయపురం వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుని కుమారుడు బండారు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News February 9, 2026
విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

హన్మకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదిక అందజేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోందని ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని చెప్పారు.
News February 9, 2026
VZM: పీజీఆర్ఎస్లో వింత అర్జీ

నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన కర్రోతు పైడినాయుడు పీజీఆర్ఎస్లో అర్జీ ద్వారా అభినందించారు. ఆయన భార్యకు సాధారణ కాన్పు చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడిన డాక్టర్ తిరుమలదేవి, సిబ్బంది సేవలను ప్రశంసించారు. సాధారణంగా సమస్యలపై వినతులు రావడం పరిపాటి. ప్రభుత్వ సేవలను ప్రశంసిస్తూ అర్జీ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.


