News January 24, 2026
బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.
Similar News
News February 18, 2026
బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.
News February 18, 2026
AIతో కొత్త మతాలు.. మిషనరీలు: హరారీ

దావోస్లో నిఖిల్ కామత్తో జరిగిన చర్చలో ప్రముఖ చరిత్రకారుడు యువల్ నోవా హరారీ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో AI కొత్త మతాలను సృష్టించడమే కాకుండా, సొంత మిషనరీలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. మతగ్రంథాల సారాంశాన్ని విశ్లేషించడంలో మనుషుల కంటే AI మెరుగ్గా ఉంటుందని తెలిపారు. భక్తుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు.
News February 18, 2026
నెదర్లాండ్స్తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

T20WC: అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.


