News June 2, 2024

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం

image

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.

Similar News

News February 18, 2026

VZM: సామాన్యులకు రూ.60 లక్షల ప్రమాద బీమా

image

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.

News February 18, 2026

VZM: సామాన్యులకు SBI రూ.60 లక్షల ప్రమాద భీమా

image

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.

News February 18, 2026

VZM SP కీలక హెచ్చరికలు

image

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్‌లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్‌లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.