News October 21, 2025
బొబ్బిలిలో మానవత్వం మంట కలిసింది..

స్పృహతప్పి పడిపోయిన మహిళను ఆసుపత్రికి తరలించాల్సిన జనం పూర్తిగా పట్టించుకోలేదు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి ఆటో స్టాండ్లో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆమె రక్తపు మడుగుల్లో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు వెళ్తున్న ఎస్ఐ రమేశ్, సిబ్బంది చూసి సపర్యలు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 21, 2025
‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

CRZ రిస్ట్రిక్షన్స్ను 500 నుంచి 200 మీటర్లకు కుదించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును తిరస్కరించాలని పర్యావరణవేత్తలు PMకి విన్నవించారు. ‘సముద్ర మట్టం పెరుగుదల వల్ల 2050కు దేశంలోని 113 సిటీలు మునిగిపోతాయని INDIA డవలప్మెంటు రిపోర్టు చెబుతోంది. ప్రస్తుత రూలే కాలం చెల్లగా, ఇంకా కుదించడం మరింత ప్రమాదం’ అని పేర్కొన్నారు. సీ లెవెల్ 91MM పెరిగిందని, ముంపు వంటి ఉపద్రవాలపై నాసా హెచ్చరించిందని గుర్తుచేశారు.
News October 21, 2025
అమలాపురం: PM ఆదర్శ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

మధ్యలో నిలిచిన పీఎం ఆదర్శ గ్రామ యోజన గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో సౌకర్యవంతంగా ఉన్న పనులకు నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అవసరంలేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు కేటాయించాలని చెప్పారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో పీఎం ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై DLDO, ఎంపీడీవోలతో సమీక్ష జరిపారు. 40% పైబడి ఎస్సీలు ఉన్న ప్రాంతానికి పథకం ఉపయోగపడుతుందన్నారు.
News October 21, 2025
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) 3కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)తో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్సైట్: https://www.becil.com/