News October 25, 2024

బొబ్బిలి వీణల తయారీదారులకు గుడ్ న్యూస్

image

Dy.cm పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బొబ్బిలి వీణల తయారీలో ఉపయోగిస్తున్న పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దేశ, విదేశాల్లో ఆదరణ ఉన్న వీణల తయారీలో ముడి సరుకుగా ఉన్న పనస కొరత కారణంగా తయారీదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా VZM, పార్వతీపురం మన్యం, SKLM జిల్లాల్లో పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News February 21, 2026

VZM: జనగణన-2027పై 27 నుంచి శిక్షణ

image

జనగణన మొదటి దశకు సంబంధించి జిల్లా, మండల స్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు MVGR కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్లాక్ మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 21, 2026

VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

image

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత: VZM SP

image

మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అధికారులకు ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు వారి రక్షణకు అవసరమైన భద్రత చర్యలు వెంటనే చేపట్టాలని సిబ్బందికి శుక్రవారం సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.