News February 10, 2025

బొబ్బిల్లంక: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సీతానగరం మండలం చిన్నకొండేపూడి చెందిన దంతె ప్రసాద్ (24) బొబ్బిలంక వద్ద ప్రమాదవశాత్తు ట్రాలీ వెనుక చక్రంలో పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తు బొబ్బిల్లంక వద్ద ట్రాలీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: వికసిత భారత్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందేశ్వరి

image

‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025’ సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం కమిటీ సభ్యులతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

News February 11, 2026

పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్‌ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.