News August 23, 2025

బోధన్‌కు నేడు మందకృష్ణ మాదిగ రాక

image

బోధన్ పట్టణ కేంద్రంలోని ఆయేషా గార్డెన్స్‌లో నిర్వహించే VHPS, MRPS సన్నాహక సభకు MRPS వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు పెంచకపోవడంతో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసే దిశగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వికలాంగులు, పెన్షన్‌దారులు పెద్దఎత్తున ఈ సభకు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.

Similar News

News September 7, 2025

NZB: ఆలయాల మూసివేత

image

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.

News September 7, 2025

ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

image

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

News September 7, 2025

NZB: జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు

image

నిజామాబాద్ గోల్ హనుమాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. జెండా, ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు.