News October 11, 2024

బోనం సమర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

దసరా నవరాత్రుల సందర్భంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అత్యంత భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. బుక్కరాయసముద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనం సమర్పించి, పూజా కార్యక్రమం నిర్వహించారు. మొక్కును చెల్లించుకున్నారు. నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News October 11, 2024

కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా చేయాలి: కౌన్సిలర్ల డిమాండ్

image

కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసా రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రయత్నించలేదని, శాసనసభ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయకపోగా.. ఓటమి కోసం పాటుపడ్డారని ఆరోపించారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. వారిని ఆపే ప్రయత్నం ఛైర్ పర్సన్ చేయలేదని అన్నారు.

News October 11, 2024

బోనం సమర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

దసరా నవరాత్రుల సందర్భంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అత్యంత భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. బుక్కరాయసముద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనం సమర్పించి, పూజా కార్యక్రమం నిర్వహించారు. మొక్కును చెల్లించుకున్నారు. నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

News October 11, 2024

హిందూపురం ప్రభుత్వ టీచర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

హిందూపురానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయినికి చెక్ బౌన్స్‌ కేసులో పెనుకొండ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల మేరకు.. 2022లో గుట్టూరుకు చెందిన ఈశ్వరమ్మకు హిందూపురానికి చెందిన ఓ ఉపాధ్యాయిని డబ్బు ఇవ్వాల్సి ఉండగా చెక్‌ ఇచ్చింది. అది బౌన్స్‌ కావడంతో కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది.