News August 17, 2025
బోనకల్: సీపీఎం సీనియర్ నాయకుడిని కలిసిన కేరళ ఎమ్మెల్యే

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News August 18, 2025
ఖమ్మం: లైసెన్స్డ్ సర్వేయర్లకు నేటి నుంచి శిక్షణ

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత శిక్షణ ఉమ్మడి ఖమ్మం సహా 23 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
News August 17, 2025
తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News August 17, 2025
శంకరగిరి తండాలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.