News November 22, 2025
బోయినిపల్లి: ‘బాల్యంలోనే TARGET ఫిక్స్ చేసుకోవాలి’

విద్యార్థులు బాల్యంలోనే లక్ష్యాన్ని ఎంచుకోని దాని సాధనకు కృషి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని KGBVని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. తాము కోరుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.
Similar News
News November 23, 2025
స్వచ్ఛ ఏలూరు లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా అని స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని, ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 23, 2025
TODAY HEADLINES

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.


