News January 23, 2025
బ్యాంకుల భద్రత అధికారులు దృష్టి పెట్టాలి: సీపీ

వినియోగదారుల సొమ్ము కాపాడేందుకు బ్యాంక్ అధికారులు బ్యాంకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వినియోగదారుల సొమ్మును భద్రపరచుకున్న సంబంధిత బ్యాంక్ అధికారులు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరిధిలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.
Similar News
News February 24, 2026
పుట్టపర్తి సివిల్ జడ్జి కోర్టుకు బాంబు బెదిరింపు

పుట్టపర్తిలోని సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. కోర్టులో బాంబు ఉందని మెయిల్ రావడంతో డీఎస్పీ విజయ్ కుమార్ రంగంలోకి దిగి మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని, నకిలీ మెయిల్ ఐడీలతో కొందరు వ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు.
News February 24, 2026
త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా: దేవ్జీ

TG: మావోయిస్టు నేతలు దేవ్జీ, రాజిరెడ్డి, చొక్కారావు, నర్సింహారెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని దేవ్జీ వెల్లడించారు. అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడానన్నారు. మావోయిజం అంతం కాదని, ప్రజా సమస్యలపై పోరాడుతానని రాజిరెడ్డి పేర్కొన్నారు. అజ్ఞాతంలోని 11 మందిలో కొంతమంది తమతో చర్చిస్తున్నారని DGP శివధర్రెడ్డి తెలిపారు. గణపతి అడవిలో లేరని తెలిసిందన్నారు.
News February 24, 2026
ఇంటర్ పరీక్షలకు 359 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 64 పరీక్ష కేంద్రాలలో జరిగినట్లు ఆర్ఐవో రమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,919లో 20,588 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 గాను 1,872 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామని ఆయన తెలిపారు.


