News March 22, 2025

బ్యాంక్, జిల్లా అధికారులతో ADB కలెక్టర్ సమావేశం

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన శుక్రవారం DCC/DLRS సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం ఈజీపీ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా శక్తి పథకం, తదితర వాటిపై బ్యాంకర్లు, అధికారులతో వారి శాఖల లక్ష్యంపై సమీక్షించారు. పెండింగ్ అప్లికేషన్స్ లబ్ధిదారులతో ఈ నెల 24న సమావేశం నిర్వహించి వివరాలు సేకరించాలని, బ్యాంకు వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు.

Similar News

News November 5, 2025

పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.

News November 5, 2025

UTNR: కొత్త ఐటీడీఏ పీవో ముందున్న సవాళ్లివే

image

ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవోగా యువరాజ్ మర్మాట్ నియమితులయ్యారు. పీవీటీజీల అభివృద్ధి, గిరిజన గ్రామాల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం, రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రవేశపెట్టిన మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 4, 2025

ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

image

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.