News December 28, 2025
బ్యాడ్మింటన్లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
Similar News
News December 29, 2025
రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.
News December 29, 2025
సాగుకు ఆధునిక యంత్రాల సాయం.. రైతుకు తగ్గిన శ్రమ

గతంలో వరి, ఇతర పంటల సాగులో నారు, విత్తనం దశ నుంచి కోత వరకు మానవ శ్రమ, ఎడ్ల శ్రమ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల కారణంగా పంట నాటే దశ నుంచి కోత వరకు అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా నాగలి, దంతె, గొర్రు వంటి పనిముట్ల వినియోగం బాగా తగ్గింది. పంట నాటే దశ నుంచి కోత వరకు ఆధునిక యంత్రాలు కీలకపాత్ర పోషిస్తూ అన్నదాత శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేస్తున్నాయి.
News December 29, 2025
Pawar PoliTricks: అబ్బాయ్-బాబాయ్ కలిశారు

మహారాష్ట్రలో ఫ్యామిలీస్ రీయునైట్ అవుతున్నాయి. మొన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు కలిస్తే నిన్న పింప్రీ పీఠానికై పవార్స్ ఒకే పరివార్ అని ప్రకటించుకున్నారు. పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన NCP, బాబాయ్ శరద్ పవార్ NCP (SP)లు కలిసి పోటీ చేస్తాయని అజిత్ పవార్ ప్రకటించారు. 1999-2017 వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అవిభాజ్య NCP చేతిలో ఉండేది.


