News October 6, 2025

బ్యాలెట్ పేపర్ల ముద్రణకు 8లోపు టెండర్లు దాఖలు చేయాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అక్టోబర్ 8లోపు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లోపు బ్యాలెట్ పేపర్లను ముద్రణ చేయాలని ఆదేశించారు. ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2025

స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.

News October 6, 2025

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 వేల మంది విద్యార్థుల వసతి, తాగునీరు, విద్యుదీకరణ, సబ్‌స్టేషన్, క్రీడా ప్రాంగణం వంటి అన్ని సదుపాయాలతో భవనాలను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభానికి సిద్ధంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 6, 2025

మోదీ నుంచి అవార్డు అందుకున్న శ్రీచైతన్య విద్యార్థిని

image

శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని తాళ్లురి పల్లివి ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకుంది. ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధాని అందజేశారు. PM-SETUలో భాగంగా నిర్వహించిన కాంపిటేషన్‌లో AI ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. దీంతో కళాశాల ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి గీతిక, ప్రిన్సిపల్ లక్షినారాయణ అభినందించారు.