News October 10, 2025

బ్రహ్మసముద్రంలో కేజీబీవీ విద్యార్థి మృతి

image

బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న చందన శుక్రవారం మృతి చెందిందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాల మేరకు.. పడమటి కోడిపల్లి గొల్లల దొడ్డికి చెందిన చందన కేజీబీవీలో చదువుతోంది. కడుపు నొప్పి అధికంగా ఉందని SO మహాలక్ష్మికి చెప్పింది. చందనను SO, తల్లిదండ్రులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 11, 2025

కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే?

image

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. అలాగే.. విజయవాడ కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే యుగాంతమే అని కూడా చెప్పారు. ‘అంత ఎత్తయిన కొండపైకి కృష్ణా నీరు రావడమంటే, అది ప్రకృతి ప్రకోపానికి, ప్రళయానికి సంకేతం. ఆ పెను మార్పు సంభవించినప్పుడు లోకంలో జీవరాశి నిలవడం కష్టం. ఇది యుగాంతానికి దారి తీసే భయంకరమైన దైవిక సంకేతం’ అని పండితులు చెబుతున్నారు.

News October 11, 2025

ముత్తాఖీ ప్రెస్‌మీట్‌.. ఉమెన్ జర్నలిస్టులకు నో ఇన్విటేషన్

image

ఇవాళ భారత పర్యటనకు వచ్చిన అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ మంత్రి జైశంకర్‌తో భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఇంకా లింగ వివక్ష చూపుతోందని భారత మహిళా జర్నలిస్టులు మండిపడుతున్నారు. పురుష జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసి నిరసన తెలపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై మీరేమంటారు?

News October 11, 2025

బేగంపేట్‌ సీఎం ప్రజావాణికి 275 దరఖాస్తులు

image

బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 275 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 76, రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇందిరమ్మ ఇళ్ల కోసం 85, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.