News January 31, 2025

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణ అధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 4, 2025

ADB: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

image

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, తలమడుగు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, దిలావర్పూర్, లక్ష్మణచాంద కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

News November 4, 2025

WGL: వారి బెనిఫిట్స్ బకాయిలు రూ.3,270 కోట్లు!

image

ఉమ్మడి జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 నెలల్లో 654 మంది రిటైర్ అయ్యినా, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.3,270 కోట్లు ఇంకా చెల్లించలేదు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్క్యాష్మెంట్, బీమా తదితర ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా కుంగిపోతున్నారు.“రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి మహాప్రభో” అంటూ వినతి పత్రాలు, కోర్టు పోరాటాలు చేస్తున్నారు.