News March 9, 2026
బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.
Similar News
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.


