News December 25, 2025
బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లాలో ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ తగ్గించామని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. 2023లో రహదారిపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా, 2025 నాటికి 30కి తగ్గించామన్నారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సం.రం 350-400 వరకు రోడ్డు ప్రమాద మరణాలు ఉండేవని, అలాంటిది ఈ సం.రం 42కు తగ్గాయన్నారు. వచ్చే సం.రం బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తామన్నారు.
Similar News
News December 25, 2025
నల్గొండ: 31న అర్ధరాత్రి వరకు వైన్స్

న్యూ ఇయర్ నేపథ్యంలో DEC 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వైన్స్ రాత్రి 12 గంటల వరకు, బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో యజమానులు భారీ ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్తో దుకాణాలను ముస్తాబు చేయడంతో పాటు, గిరాకీకి తగ్గట్టుగా అన్ని బ్రాండ్లను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయి విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.
News December 25, 2025
NLG: 2025 రిపోర్ట్.. సైబర్ నేరాలు పెరిగాయి

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సాధారణ నేరాలు తగ్గాయని ఆయన వెల్లడించారు. అయితే సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. 2024లో 235 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 255 సైబర్ నేరాలు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులు 216 నుంచి 196కు తగ్గాయి. పోక్సో చట్టం కింద గతేడాది 121, ఈ ఏడాది 117 కేసులు పైలయ్యాయి.
News December 24, 2025
ప్రమాదాల్లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాను వచ్చే ఏడాది రహదారి ప్రమాదాల్లేని జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు.


