News February 6, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఈఓ మహేశ్

కాళేశ్వరం ఆలయంలో రేపటి నుంచి జరుగనున్న మహాకుంభాభిషేకానికి రానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈఓ మహేష్ అన్నారు. పీఠాధిపతులు, అర్చకులు, స్వాములు గోపురం పైకి ఎక్కేందుకు వరంజాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ లైట్లు, తాగునీటి వసతి, భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర ప్రసాదం ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కుంభాభిషేకం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు తరలిరావాలని కోరారు.
Similar News
News November 7, 2025
సిరిసిల్ల: సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు

SHG సభ్యులకు పంచడానికి 64 లక్షల చీరలు సిద్ధమవుతున్నాయని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలో తయారవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరలను 32 జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం పరిశీలించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.
News November 7, 2025
సిరిసిల్ల: ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ సిద్ధం: కలెక్టర్

రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ (యూనిఫామ్స్) సిద్ధమవుతున్నాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే ఈ చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం హాజరయ్యారు.
News November 7, 2025
SRSPకి తగ్గిన ఇన్ఫ్లో.. గేట్లు మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వచ్చే వరద ప్రవాహం చాలావరకు తగ్గిపోయింది. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 332.54 మీటర్లు, నిల్వ 80.5 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 9,454 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సరస్వతి కాల్వకు 650, ఎస్కేప్ కెనాల్ ద్వారా 8,000, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు నష్టపోతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గేట్లను మూసేశారు.


