News April 4, 2025
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లను చేయాలి: మంత్రి తుమ్మల

రామయ్య కళ్యాణానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే వెంకట్రావుపాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
మూవీ ఇండస్ట్రీలోకి రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ‘URMarv’ పేరిట ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోను లాంచ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మాథ్యూ వాన్తో కలిసి పనిచేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఫ్యాషన్, పర్ఫ్యూమ్, లగ్జరీ వాచ్లకు సంబంధించిన వ్యాపారాల్లో భాగమైన రొనాల్డో ఇప్పుడు సినిమాల్లోనూ అడుగు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన యూట్యూబ్ ఛానల్నూ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
వడ్డేపల్లి చెరువులో దూకి NIT విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. వడ్డేపల్లి చెరువులో దూకి వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, హైదరాబాద్కు చెందిన అతను ఎన్ఐటీ హాస్టల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 11, 2025
వడ్డేపల్లి చెరువులో దూకి NIT విద్యార్థి ఆత్మహత్య

హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. వడ్డేపల్లి చెరువులో దూకి వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా, హైదరాబాద్కు చెందిన అతను ఎన్ఐటీ హాస్టల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.