News August 19, 2024
భట్టి విక్రమార్కకు రాఖీ కట్టిన మహిళా కమిషన్ చైర్మన్

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు, ఇతర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సంక్షేమ ధ్యేయంగా మహిళలను చూసుకుంటుందని తెలిపారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 11, 2025
యాంటీ-నార్కోటిక్ బ్యూరోగా రూపేశ్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.
News March 11, 2025
HYD: ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్: MD

ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో సోమవారం సత్వర ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్ ను ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. జలమండలి ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు చెప్పారు. మెడ్ ఫ్లాష్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రూ.3 లక్షల వరకు ఉచిత సేవలను పొందవచ్చన్నారు.
News March 11, 2025
HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

హైదరాబాద్లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.