News April 14, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

భద్రకాళి అమ్మవారు సోమవారం సందర్భంగా భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమంలో అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందేందుకు భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.
Similar News
News April 15, 2025
ప్రతీకార రాజకీయాలకు ఇది నిదర్శనం: కాంగ్రెస్

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో ఈడీ <<16108914>>చేర్చడంపై<<>> కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు, బెదిరింపులకు ఇది నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై తమ పార్టీ మౌనంగా ఉండదని, సత్యమేవ జయతే అంటూ Xలో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధమైన పాలన ముసుగులో చేస్తున్న రాజకీయమని రమేశ్ మండిపడ్డారు.
News April 15, 2025
ఉమ్మడి విశాఖ జిల్లాలో 111 పోస్టులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 111 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 59 SGT(ప్రాథమిక స్థాయి), 52 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 15, 2025
కొత్త సినిమా కలెక్షన్ల సునామీ

అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తమిళనాడులో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సంభవం కొనసాగుతోందని పేర్కొంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. అజిత్ కెరీర్లో తమిళనాడులో తొలి రోజే అత్యధిక ఓపెనింగ్స్(రూ.30కోట్లు+) రాబట్టిన చిత్రంగానూ నిలిచింది.