News December 15, 2025

భద్రకాళి సన్నిధిలో మోగ్లీ చిత్ర యూనిట్

image

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలయిన మోగ్లీ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

Similar News

News December 20, 2025

గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

image

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ​ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News December 20, 2025

బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

image

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.

News December 20, 2025

నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

image

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.