News June 5, 2024
భద్రతా చర్యలు చేపట్టిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: ఎస్పీ
కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర బలగాలతో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ సమావేశమయ్యారు. అందరూ సమష్టిగా కష్టపడటం వల్లే జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.
Similar News
News September 29, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగు పాటు.. భార్య, భర్త మృతి
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.
News September 29, 2024
అనంత: భార్య గొంతు కోసి భర్త పరార్.. మృతి
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మగట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతి(26)ని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.
News September 29, 2024
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలకు గాయాలు
గార్లదిన్నె మండలం కలగాసపల్లి క్రాస్ వద్ద హైవేపై ఆదివారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బెంగళూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 10మంది కూలీలు, బస్సు కండక్టర్ గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కూలీలంతా మహబూబ్ నగర్ వాసులు.