News July 26, 2024
భద్రతా చర్యల ఆంక్షలను కఠినతరం చేయాలి: కలెక్టర్
ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలను కఠినతరం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
Similar News
News October 1, 2024
కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు
జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.
News October 1, 2024
మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల రోడ్డులోని 49వ జాతీయ రహదారిపై కారు స్కూటర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన కంచర్ల రుద్రదీపు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
News October 1, 2024
కడప: ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు
ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఛాంబర్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.