News February 25, 2026
భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.
Similar News
News February 27, 2026
రైల్వేస్టేషన్లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

విశాఖ రైల్వేస్టేషన్లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు చేరుతుంది.
News February 26, 2026
జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం- కలెక్టర్

వయోజనులకు అక్షరాభ్యాసం జరిగితేనే రాష్ట్రం, జిల్లా అక్షరాస్యతలో ముందుకు వెళ్తుందని డా.కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడమే లక్ష్యమన్నారు. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పాలన్నారు. మార్చి 15న మొదటి దశలో అక్షరాభ్యాసం పొందిన వారికి చివరి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.


