News October 20, 2025
భద్రాచలంలో గ్యాంగ్ వార్ కలకలం..!

భద్రాచలం పట్టణంలో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి పాత మార్కెట్ వద్ద యువకులు ఘర్షణకు దిగారు. ఈ దాడిలో జగదీష్ నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 20, 2025
భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్కు సంప్రదించాలన్నారు.
News October 20, 2025
ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

NTR (D) వీరులపాడు (M) రంగాపురం శివారులో ఆకాశంలో ఇంద్ర ధనస్సు కనువిందు చేసింది. గ్రామంలో సాధారణ నుంచి మోస్తరు చిరుజల్లులు ప్రారంభమయ్యాయని, ఆ సమయంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు చూపరులను ఆకట్టుకుందని స్థానికులు తెలిపారు. గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతం ఉండడంతో కొండ ప్రాంతం సైతం పచ్చటి వాతావరణం నెలకొందని స్థానికులు అన్నారు.