News August 27, 2025

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

image

భద్రాచలంసీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News

News August 27, 2025

VKB‌లో పూల సాగు.. లాభాల్లో రైతులు

image

VKB జిల్లాలో రైతులు పూల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పూల ధరలు మెరుగ్గా ఉండటంతో పూల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. జిల్లా వ్యాప్తంగా 2,350 ఎకరాల్లో పూల సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, పూడూరు, VKB, మర్పల్లి, ధారూర్ తదితర మండలాల్లో పూలను విరివిగా సాగు చేస్తున్నారు. రైతులు పూలను HYDలోని పలు మార్కెట్లకు తరలించి లాభాలను ఆర్జిస్తున్నారు.

News August 27, 2025

ఆలయాల అభివృద్ధికి కృషి: మంత్రి ఆనం

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి ఆనం నారాయణరెడ్డి అన్నారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కాణిపాకంలో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించాం. ఆగమన పద్ధతి ప్రకారం ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆదేశించాం. సీఎం చంద్రబాబు ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.

News August 27, 2025

HYD: 20 నిమిసాల్లో భార్యను ముక్కలుగా చేశాడు!

image

మేడిపల్లి స్వాతి దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహాన్ని 20 నిమిషాల్లోనే ముక్కలు చేసి మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా DRF బృందాలు ఆమె శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.