News April 24, 2025

భద్రాచలంలో 43.1°C అత్యధిక ఉష్ణోగ్రత

image

జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాచలంలో 43.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా దమ్మపేటలో 39.1°C ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండలాల్లో 43°C, కరకగూడెంలో 42.9°C, చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, మణుగూరు మండలాల్లో 42.7°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News April 24, 2025

అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

image

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News April 24, 2025

KNR: నేటి నుంచి బాలభవన్ లో వేసవి శిక్షణ

image

కలెక్టర్, విద్యాశాఖ సహకారంతో బాలభవన్ ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయనిబాలభవన్ సూపరింటెండెంట్ కే.మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వరకు ప్రతీ రోజు ఉదయం 7 గం. నుంచి 12 గం. వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 5 నుంచి 16 సం. వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో అంబేడ్కర్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో నమోదు చేసుకోవాలన్నారు.

News April 24, 2025

పాములాంటి పాకిస్థాన్‌తో ఒప్పందం.. MP సంచలన వ్యాఖ్యలు

image

సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్థాన్ అల్లాడిపోతుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. దివంగత ప్రధాని నెహ్రూ పాకిస్థాన్‌కు నీరు ఇస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఆశపడి పాము లాంటి ఆ దేశానికి సింధు జలాలను తరలించారన్నారు. PM మోదీ ఆ ఒప్పందాన్ని నిలిపివేసి, ఏమీ అందకుండా దెబ్బ కొట్టారని చెప్పారు. 52ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడి నిర్ణయాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయని మోదీని ఉద్దేశించి ప్రశంసించారు.

error: Content is protected !!