News August 23, 2025
భద్రాచలం: మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు 38 అడుగులు వద్ద గోదావరి నీటిమట్టం ప్రవహిస్తూ ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరిలో స్నానాలకు, ఈత కొట్టడానికి, చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News August 23, 2025
HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ హ్యాక్.. జర జాగ్రత్త..!: డైరెక్టర్

సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్ లింకులను పంపించి సైబర్ మోసాలకు పాల్పడి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయని HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింక్లు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. లింక్ మెసేజ్లతో జర జాగ్రత్త..!
News August 23, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జాతీయ లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వచ్చే నెల 13న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్తో నిర్వహించడం జరుగుతుందన్నారు. కాగా జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి పోలీసులకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలను అందజేశారు.
News August 23, 2025
HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ హ్యాక్.. జర జాగ్రత్త..!: డైరెక్టర్

సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్ లింకులను పంపించి సైబర్ మోసాలకు పాల్పడి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయని HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింక్లు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. లింక్ మెసేజ్లతో జర జాగ్రత్త..!