News February 12, 2025
భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..
శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.
Similar News
News February 12, 2025
NRPT: స్థానిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నారాయణపేట పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.
News February 12, 2025
NZB: సీఎం రూ.35 వేలు బాకీ: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్లో తలపెట్టనున్న మహిళా శంఖారావం సభ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.
News February 12, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి: Dy DMHO
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని డిప్యూటీ DMHO డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని Dy DMHO సందర్శించి, ఫార్మసీ స్టోర్, ల్యాబ్, ఆయుష్ క్లినిక్లను పరిశీలించారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై సమీక్షించారు. ఇందులో అశోక్ రెడ్డి, మాధవరెడ్డి, డాక్టర్ మహేంద్ర, రవీందర్, పి.శ్రీకాంత్, రాజేశ్వరి, పాల్గొన్నారు.