News May 6, 2024

భద్రాచలం: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

భద్రాచలంలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి చింతకాయల సంజయ్ (15) శనివారం సాయంత్రం వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలు అవ్వడంతో చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. అలాగే రాజుపేట కాలనీకి చెందిన కే.లక్ష్మయ్య ఎలక్ట్రీషియన్. ఆదివారం పని అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News October 13, 2024

త్వరలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు: డీప్యూటీ సీఎం భట్టి

image

రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు.

News October 12, 2024

కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పండుగ వేళ కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో ఒకరిని రేగళ్లకు చెందిన డోలు భద్రుగా గుర్తించారు. మరొకరిది చత్తీస్ గఢ్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News October 12, 2024

కొత్తగూడెం: హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతిచెందిన ఘటన కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పినపాక మండలం అమరారం పంచాయతీలోని జిన్నలగూడెంలో బొజ్జ రజిత (26) నీళ్లు వేడి చేయడానికి హీటర్ పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. ఈ.బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.