News April 6, 2025
భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.
Similar News
News December 22, 2025
ATP: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి

గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సాయిరాజ్ (22) జంగాలపల్లి-ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుడు అనంతపురం జేఎన్టీయూ కాలేజ్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News December 22, 2025
రికార్డు సృష్టించిన స్మృతి

టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. మహిళల T20Iల్లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఏషియన్ ప్లేయర్గా నిలిచారు. 154 మ్యాచుల్లో 4,007 రన్స్ చేశారు. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 రన్స్తో తొలి స్థానంలో ఉన్నారు.
News December 22, 2025
బాపట్ల: గుప్త నిధుల వేట ముఠా అరెస్ట్

గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠా అద్దంకి RTC బస్టాండ్ వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అనుమతి లేని KS-700 స్కానర్, మెటల్ డిటెక్టర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI సుబ్బారాజు తెలిపారు.


