News September 23, 2025
భద్రాది: ‘ఆమె డ్వాక్రా పైసలు కట్టలే..!’

బూర్గంపాడు మండలం సారపాకలో డ్వాక్రా బుక్ కీపర్ వసంత తమ డబ్బులు స్వాహా చేసిందని మహిళలు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆమె ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతినెలా ఒక్కో గ్రూపు నుంచి రూ.5,96,500 చొప్పున వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదని ఆరోపించారు. రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా నెలవారీ డబ్బు కట్టడం లేదని అధికారులు చెప్పడంతో వారు విస్తుపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.
Similar News
News September 23, 2025
VJA: దుర్గమ్మ ప్రసాదం .. నేతి లడ్డూ తయారీ ఇలా.!

విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డూ అంటే భక్తులకు అత్యంత ఇష్టం. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 36 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని ఆరంభించారు. ఈసారి విశాలమైన నూతన భవనం ఆరంభించారు. ఎంతో శుభ్రత పాటిస్తూ.. స్వచ్ఛమైన.. రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు.
News September 23, 2025
BREAKING..NZB: గోడ కూలి తండ్రీకూతురి దుర్మరణం

కోటగిరిలో రైస్ మిల్లు గోడ కూలి తండ్రీకూతురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. మాలవాడకు చెందిన మహేశ్(25), అతని భార్య మహేశ్వరి, రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించి మహేశ్వరిని ఆసుపత్రికి తరలించారు.
News September 23, 2025
ఈనెల 26 వరకు వర్షాలే వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో మరో 3(26 వరకు) రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.