News October 24, 2025

భద్రాద్రిలో ముగిసిన మద్యం టెండర్లు.. 3,922 దరఖాస్తులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. జిల్లాలోని 88 దుకాణాలకుగాను చివరి రోజున 106 దరఖాస్తులు రాగా, మొత్తం దరఖాస్తుల సంఖ్య 3,922కు చేరినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కొత్తగూడెం క్లబ్‌లో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News October 24, 2025

మెదక్: విషాదం.. మృతదేహాల కోసం ఎదురుచూపు..!

image

మెదక్ మండలం <<18091691>>శివ్వాయిపల్లికి చెందిన<<>> మంగ సిద్ధగౌడ్‌కు ఆనంద్ గౌడ్, రమేశ్ గౌడ్ ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడగా అతడికి పాపన్నపేటకు చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి కుమార్తె చందన(23) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. కుమారుడు శ్రీవల్లభ గౌడ్ అలహాబాద్‌లో చదువుతున్నాడు. తల్లీకూతుళ్లు కర్నూల్ వద్ద బస్సులో సజీవ దహనం కాగా మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు.

News October 24, 2025

మెట్పల్లి నుంచి అరుణాచల గిరిప్రదక్షిణకు బస్సు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న జరగనున్న అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం మెట్పల్లి డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు నవంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు మెట్పల్లి బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం నవంబర్ 4 రాత్రికి అరుణాచలం చేరుతుందని, 5న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతుందని చెప్పారు.

News October 24, 2025

అమరావతిలో RBI ప్రధాన కార్యాలయ నిర్మాణానికై పూర్తైన ఒప్పందం

image

అమరావతిలోని నేలపాడులో 3 ఎకరాలలో 1.6 లక్షల చదరపు అడుగులలో RBI ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ముందడుగు పడింది. రూ.12 కోట్లు చెల్లించిన RBI..భూ కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది. సంబంధిత పత్రాలను CRDA ల్యాండ్స్ విభాగ అధికారి వి.డేవిడ్ రాజు..RBI అధికారి వీసీ రూపకు శుక్రవారం అందజేశారు. ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంతో పాటు అమరావతిలో RBI రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు CRDA తెలిపింది.