News February 13, 2025

భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం (UPDATE)

image

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘోర <<15448249>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చింతగుప్ప పరిధిలోని సుజ్ఞానాపురం గ్రామానికి చెందిన  భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) లుగా గుర్తించారు. అకాల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

image

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.

News February 13, 2025

అనకాపల్లి: తీర్థానికి వస్తుండగా యువకుడు మృతి

image

కె.కోటపాడు-మేడిచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద బైకు అదుపుతప్పి చోడవరం(M) గవరవరం గ్రామానికి చెందిన అప్పికొండ కిరణ్ (21) మృతి చెందాడు. విశాఖలో ఉంటున్న కిరణ్ స్వగ్రామమైన గవరవరంలో గ్రామదేవత తీర్థానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తండ్రి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే.కోటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 13, 2025

అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?

image

అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారితో కూడిన రెండో విమానం ఈ నెల 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న 104మంది వలసదారుల్ని US అమృత్‌సర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 487మంది అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని విమానాల్ని తమ వద్ద దించుతోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.

error: Content is protected !!