News March 26, 2025
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
Similar News
News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
News July 9, 2025
నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.
News July 9, 2025
సిగాచీ.. ఆ 8 మంది మృతిచెందారని అనుమానాలు

TG: సిగాచీ ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకుముందు 44 మంది మరణించారు.