News March 1, 2025
భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 26, 2026
కామారెడ్డి: ‘స్పందించకుంటే 195 వాహనాలకు వేలం’

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నాయని, యజమానులు తమ ధ్రువపత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. 6 నెలల గడువులోగా తగిన ఆధారాలతో సంప్రదించని పక్షంలో, చట్టబద్ధంగా వేలం ద్వారా విక్రయిస్తామని స్పష్టం చేశారు.
News February 26, 2026
పార్వతీపురం: ‘బాల కార్మికులు పనికి కాదు.. బడికి వెళ్లాలి’

జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని.. బడికి వెళ్లాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో కార్మికుల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారి ఎసిఎల్ సువర్ణను ఆదేశించారు. బాలల హక్కులను కాపాడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 26, 2026
పార్వతీపురం: డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయాలని సూచించారు.


