News February 28, 2025
భద్రాద్రి: ఇసుక రవాణా.. ప్రాణం బలితీసుకుంది!

అక్రమ ఇసుక రవాణా వల్ల ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోవడమే కాక, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గుంపెనగుడెంలో ఇసుక ట్రాక్టర్లు తోలుతుండగా, గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై ఇసుక ట్రాక్టర్ వెళ్లడంతో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు మరణించారని, శ్యామలచెన్ను అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.
Similar News
News February 28, 2025
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.
News February 28, 2025
HYD: కేంద్రమంత్రికి సీఎం బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీలతో లేఖ రాశారు. పలు ప్రభుత్వ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. అందులో కీలకంగా తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరు బాధ్యత కిషన్ రెడ్డిదేనన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం వచ్చిందని హైదరాబాద్ మెట్రో విస్తరణకు పలు విజ్ఞప్తులను పట్టించుకోలేదని వెల్లడించారు.
News February 28, 2025
ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!