News January 31, 2025

భద్రాద్రి: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

image

చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.సుచరిత గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. కొత్తగూడెం జిల్లా రామవరంనకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద, సన్యాసి బస్తీకి చెందిన కొడాలి నరసింహారావు రూ.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు ఇచ్చాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.

Similar News

News September 15, 2025

HYD: సబ్సిడీ.. అర్హులకు ఎప్పుడు?

image

అర్హులైన వారికి రూ.500కే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ పలువురు ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.

News September 15, 2025

ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

image

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News September 15, 2025

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు

image

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు వచ్చినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం తెలిపింది. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఫిర్యాదుల రూపంలో వచ్చినట్లు ఆయన తెలిపారు. కేసుల పరిష్కారంలో చిత్తశుద్ధి కనపరచాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.