News January 31, 2025
భద్రాద్రి: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.సుచరిత గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. కొత్తగూడెం జిల్లా రామవరంనకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద, సన్యాసి బస్తీకి చెందిన కొడాలి నరసింహారావు రూ.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు ఇచ్చాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.
Similar News
News November 16, 2025
పింగిళి కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

HNK వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ- పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్), ఎమ్మెస్సీ (జువాలజీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్) వంటి కోర్సులకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. సీపీజీఈటీ-2025 అర్హత తప్పనిసరి అని చెప్పారు.
News November 16, 2025
పల్నాడు: గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2025-26 సంవత్సరానికి మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను పంచాయితీలకు జమచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాకు రూ.31కోట్లు విడుదలయ్యాయి. చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
News November 16, 2025
దేవారాపల్లి: ప్రమాదకర ప్రయాణం చేసిన మహిళలు

వరి కోతలతో వ్యవసాయ పనులకు డిమాండ్ పెరిగింది. సుమారు 25 మందికి పైగా మహిళా కూలీలు ఒక్క ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యం దేవరాపల్లి (M) కాశీపురంలో ఆదివారం కనిపించింది. పని ప్రదేశాలకు సకాలంలో చేరుకోవడానికి, రవాణా ఖర్చు ఆదా చేసుకోవడానికి, ప్రాణాలకు తెగించి ఇలా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆటోలో నిలబడటానికి కూడా చోటు లేక, కొందరు మహిళలు అంచుల్లో వేలాడుతూ ప్రయాణం కొనసాగించారు.


