News July 9, 2025
భద్రాద్రి: చెరువులో సింగరేణి ఉద్యోగి గల్లంతు

సరదాగా గడుపుదామని బయటకు వెళ్లిన మిత్రబృందంలో ఒకరు గల్లంతైన ఘటన మణుగూరు(M) రేగులగండి చెరువులో బుధవారం చోటుచేసుకుంది. సింగరేణిలో EP ఆపరేటర్గా పని చేస్తున్న మంచిర్యాల(D) శ్రీరాంపూర్కు చెందిన సుంకరి శ్రీనివాస్ సహోద్యుగులతో కలిసి చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత చెరువులో సరదాగా ఈత కొడుతుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.
Similar News
News July 10, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ ఓరుగల్లులో అవినీతి మామూలుగా లేదు!
✓ కాజీపేటలో 73 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
✓ గుట్కాలు విక్రయిస్తే నేరం: టాస్క్ఫోర్స్ ACP
✓ WGL: హత్య కేసులో ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష
✓ వేధిస్తే షీ-టీంకు తెలుపండి: షీ-టీం ఇన్స్పెక్టర్
✓ ఆత్మకూరు: కల్లును కల్తీ చేస్తే జైలుకే: ఇన్స్పెక్టర్
✓ మరిపెడ మండలంలో NIA సోదాలు
News July 10, 2025
జగిత్యాల: ‘ప్రమోషన్లపై క్యాలెండర్ను రూపొందించాలి’

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లపై ఒక క్యాలెండర్ను రూపొందించాలని తపస్ రాష్ట్ర సహ అధ్యక్షుడు నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు దేవయ్య కోరారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని పలు పాఠశాలలో తపస్ సభ్యత్వాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల రిటైర్మెంట్లు ప్రారంభమైన నైపథ్యంలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతున్నాయన్నారు. దీనిపై క్యాలెండర్ రూపొందిస్తే ఉపాధ్యాయుల కొరత సులభంగా తీరుతుందన్నారు.
News July 10, 2025
బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థికి పవన్ అభినందనలు

AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అతడిని బ్యాటరీ సైకిల్పై ఎక్కించుకుని ఆయన స్వయంగా నడిపారు. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా రూ.లక్ష అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Dy.CMO రిలీజ్ చేసింది.