News February 5, 2026
భద్రాద్రి: జనవరిలో 49 ప్రమాదాలు.. 17 మంది మృతి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని వీసీ ద్వారా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గత జనవరి నెలలో 49 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి, చర్యలు చేపట్టాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 9, 2026
సదాశివనగర్: అనారోగ్యం బాగా లేక ఆత్మహత్య

సదాశివనగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన అశోక్ అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News February 9, 2026
నిజాంసాగర్: రూపు కోల్పోతేనేమీ..ఫొటో ఫోజులకు అడ్రస్ ఇదే!

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకప్పుడు పర్యాటకులను తీసుకెళ్లిన బోటు కాలక్రమేణా నిర్వహణ కరువై ప్రస్తుతం నీటి ఒడ్డున తుప్పు పట్టి రూపురేఖలను కోల్పోయింది. ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఇనుప చట్రంగా మారిన దీనిపైనే ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఓ వ్యక్తి ఫొటో దిగుతున్న సన్నివేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.
News February 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 09, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


