News December 3, 2025

భద్రాద్రి: జాతిపితను పట్టించుకునేదెవరో?

image

బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం పగుళ్లు వచ్చి, దయనీయ స్థితిలో ఉన్నా పట్టించుకునేవారు లేరని స్థానికులు వాపోతున్నారు. జయంతి, వర్ధంతుల సమయంలో చూపిన శ్రద్ధ, విగ్రహం ఆహార్యంపై చూపడం లేదన్నారు. కళ్లజోడు, చేతికర్ర లేకపోవడంతో స్థానికులు తాత్కాలికంగా జామాయిల్ కర్రను చేతిలో ఉంచారు. మాటలు చెప్పే నాయకులు జాతిపిత విగ్రహాన్నే పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

image

పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని నామినేషన్ కేంద్రాలను పెద్దపల్లి DCP భూక్య రామిరెడ్డి, పెద్దపల్లి ACP గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను జరపాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ వెంట సీఐ ప్రవీణ్ కుమార్, గ్రామీణ ఎస్సై మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత ఉన్నారు.

News December 3, 2025

మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

image

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్‌ కిడ్‌’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.

News December 3, 2025

కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

image

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.