News February 28, 2026

భద్రాద్రి జిల్లాలో గిరిజన కుటుంబాల్లో వెలుగులు

image

భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయి. ఏజెన్సీలో ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ధర్తి అభా జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 3,159 మంది గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. రూ.15.87 కోట్లతో ఇంటింటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వనున్నారు.

Similar News

News March 3, 2026

ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

image

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.

News March 3, 2026

నాటుసారాను పూర్తి స్థాయిలో నివారించాలి: కలెక్టర్

image

నాటుసారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరీలో 19 గ్రామాలు, బీ కేటగిరీలో 19 గ్రామాలు, సీ కేటగిరిలో 91 గ్రామాలలో నాటు సారాను పూర్తి స్థాయిలో నివారించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మారడానికి కృషి చేయాలన్నారు.

News March 3, 2026

అచ్చంపేట: ఇంటి ముందు క్షుద్రపూజల కలకలం

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనిలోని ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు పూజలు చేసి ఒక ఇంటి ముందు మెట్లపై పాము బొమ్మ, పసుపు కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, కోడి కట్టి వేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.