News August 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం
Similar News
News August 18, 2025
నాగల్గిద్ద: పెన్షన్ కోసం ఎదురు చూపు

నాగల్గిద్ద మండలంలోని శేరిధామస్గిద్దకు చెందిన తుర్రురాజు మూడేళ్ల నుంచి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకి గాయం కావడంతో వైద్యులు అతని రెండు కళ్లు తొడ వరకు తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ కోసం ఎన్ని సార్లు సదరం క్యాంప్నకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి పెన్షన్ మంజురు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
News August 18, 2025
సినిమా ఛాన్స్ల కోసం మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించే కథలకు తాను సరిపోతానని భావించి ఆయన వెంటపడేవాడినని సినీ నటుడు నాగార్జున తెలిపారు. అలా మా కాంబోలో వచ్చిందే ‘గీతాంజలి’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నాగేశ్వరరావు కొడుకుగానే తొలి ఆరేడు సినిమాలు చేశా. ఇది కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. మజ్ను సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆఖరి పోరాటంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నా’ అని నాగ్ చెప్పుకొచ్చారు.
News August 18, 2025
DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21వ తేదీ లాస్ట్

ఉమ్మడి MBNR జిల్లాలో DEECET-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా DEECETలో అర్హత సాధించి ఉండాలని, అలాగే ఏ కళాశాలలోనూ సీటు పొంది ఉండకూడదన్నారు. అడ్మిషన్ల గడువు ఈ నెల 21 అని ఆయన తెలిపారు.