News September 23, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓మాదకద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ జితేష్
✓ పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ జితేష్
✓యూరియా కోసం లక్ష్మీదేవిపల్లిలో రైతుల రాస్తారోకో
✓వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు
✓అశ్వారావుపేట: 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
✓భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
✓బూర్గంపాడు, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
Similar News
News September 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 24, 2025
ఉట్నూర్: ఆర్టీసీలో ఉద్యోగాలు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్స్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చెసిందని, అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా తెలిపారు. ఉమ్మడి ADBజిల్లాలోని అర్హులైన గిరిజన యువత మరిన్ని వివరాల కోసం ఐటీడీఏలోని GSUK కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News September 24, 2025
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువులను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు కబ్జాలకు గురి కావడంతో వరద నేరుగా చెరువుకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.