News January 14, 2026
భద్రాద్రి జిల్లాలో 1,85,348 మంది ఓటర్లు

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లు ఉండగా, అత్యంత తక్కువగా అశ్వారావుపేటలో 16,850 మంది ఉన్నారు. ఇల్లందులో 33,723 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.
Similar News
News January 27, 2026
ఇదీ ట్విస్ట్ అంటే.. పాక్ ప్లేస్లో బంగ్లాకు ఛాన్స్?

బంగ్లాకు మద్దతుగా తామూ T20 WCను బహిష్కరిస్తామంటూ పాక్ గంతులు వేస్తోంది. ఇప్పటికే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్కు ICC అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాక్ కూడా వైదొలగితే ఆ ప్లేస్లోకి మళ్లీ అదే బంగ్లాను వెనక్కి పిలిచి శ్రీలంకలో మ్యాచ్లు ఆడించాలని ICC ప్లాన్ చేస్తున్నట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. బంగ్లాకు మద్దతు సాకుతో భారత్పై విషం చిమ్ముతున్న పాక్ తన సీటుకు తానే ఎసరు పెట్టుకుంటోందన్నమాట!
News January 27, 2026
ఇదీ ట్విస్ట్ అంటే.. పాక్ ప్లేస్లో బంగ్లాకు ఛాన్స్?

బంగ్లాకు మద్దతుగా తామూ T20 WCను బహిష్కరిస్తామంటూ పాక్ గంతులు వేస్తోంది. ఇప్పటికే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్కు ICC అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాక్ కూడా వైదొలగితే ఆ ప్లేస్లోకి మళ్లీ అదే బంగ్లాను వెనక్కి పిలిచి శ్రీలంకలో మ్యాచ్లు ఆడించాలని ICC ప్లాన్ చేస్తున్నట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. బంగ్లాకు మద్దతు సాకుతో భారత్పై విషం చిమ్ముతున్న పాక్ తన సీటుకు తానే ఎసరు పెట్టుకుంటోందన్నమాట!
News January 27, 2026
ముగిసిన హల్వా వేడుక.. ఇక అధికారులకు ‘లాకిన్ పీరియడ్’

కేంద్ర బడ్జెట్ తయారీ చివరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన ‘హల్వా సెరిమనీ’కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హాజరై అధికారుల నోర్లు తీపి చేశారు. ఏదైనా శుభకార్యానికి ముందు నోటిని తీపి చేయడం మన ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని బడ్జెట్ టైమ్లోనూ పాటిస్తారు. ఇది ముగియగానే 60-70 మంది అధికారులు లాకిన్ పీరియడ్లోకి వెళ్తారు. బడ్జెట్ను సీక్రెట్గా ఉంచడం కోసం వాళ్లంతా ఫిబ్రవరి 1వరకు నార్త్ బ్లాక్లోనే ఉంటారు.


