News February 21, 2025

భద్రాద్రి జిల్లాలో 36 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

image

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వసిద్ధం చేయాలని కలెక్టర్ జీతేవ్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 36 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు మొదటి సంవత్సరంలో 9,225 మంది, రెండో సంవత్సరంలో 10,003 మంది విద్యార్థులు హజరవుతారన్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుతాయన్నారు.

Similar News

News February 25, 2026

NGKL: నాగర్ కర్నూల్‌లో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం మధ్య మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ చేరుకున్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, ఆపై నేరుగా దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. 58 రోజులుగా సాగుతున్న రిజర్వాయర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలుపుతూ, అక్కడి నాయకులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. బాధితుల పక్షాన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News February 25, 2026

చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

image

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

News February 25, 2026

కుళాయి నీటితో పూజ చేయవచ్చా?

image

బావులు, నదులు అందుబాటులో లేనప్పుడు కుళాయి నీటిని కూడా పూజకు వాడొచ్చంటున్నారు పండితులు. ‘జలం అమృతంతో సమానం. మనం తాగే శుభ్రమైన నీటినే దైవ కార్యాలకు వినియోగించవచ్చు. అయితే, ఆ నీటిని పాత్రలో తీసుకున్నప్పుడు పుణ్యనదులను స్మరిస్తే అది మరింత పవిత్రంగా మారుతుంది. వనరులు లేనప్పుడు ఉన్నవాటినే భక్తితో సమర్పించాలి. నిత్యకర్మలను ఆపకూడదు. చిత్తశుద్ధి వీడకూడదు. లభించిన నీటితోనే పూజ చేయాలి’ అంటున్నారు.